న్యూస్4టుడే, 23 జనవరి 2026 : రాష్ట్ర ఐటీ, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఈ సందర్భంగా నిడదవోలు నియోజవర్గం నుండి నలుమూలల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, భారీ సంఖ్యలో హాజరై నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
